పిచ్చి ట్రంప్‌ ..

 



నా తండ్రి బలిదానంతో అంతా ముగిసిపోలేదు


- సులేమానీ కుమార్తె హెచ్చరిక


- అశేష జనవాహిని మధ్య జరిగిన సులేమానీ అంత్యక్రియలు


టెహ్రాన్‌, జనవరి 6(జనం సాక్షి) : అమెరికా వైమానిక దాడిలో చనిపోయిన ఇరాన్‌ ఖుద్స్‌ ఫోర్ష్‌ కమాండర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ అంత్యక్రియలు అశేష జనవాహిని మధ్య సోమవారం ముగిసాయి. ఆయన అంత్యక్రియలకు తరలివచ్చిన జనం సందోహం, అభిమానులతో ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వీధులు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా సులేమానీ కుమార్తె అమెరికాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని చంపిన అమెరికాకు చీకటి రోజులు దాపురించాయని సులేమానీ కుమార్తె జీనాబ్‌ సులేమానీ హెచ్చరించారు. అంతేకాదు 'పిచ్చి ట్రంప్‌... తన తండ్రి బలిదానంతో అంతా ముగిసిందని అనుకోకంటూ ఆమె వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ఆదేశాలతోనే సులేమానీ అమెరికా సైన్యం హత్యచేసినట్టు ధ్రువీకరించిన తర్వాత జీనాబ్‌ ఇరాన్‌ అధికారిక విూడియాలో ఆమె మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. మరోవైపు, ఖాసిం సులేమానీ హత్యకు ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ కూడా శపథం చేసింది. మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ ప్రాబల్యాన్ని విస్తరించి, ఆ దేశ జాతీయ వీరుడిగా నీరాజనాలు అందుకున్న ఖాసిం.. చావుకు ప్రతీకారం తీర్చుకుంటామని పలువురు ప్రతిజ్ఞ చేశారు. 1989లో ఆధునిక ఇరాన్‌ వ్యవస్థాపకుడు 


అయతుల్లా రు¬ల్లా ఖమోనీ అంత్యక్రియల తర్వాత అంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి జనం హాజరుకావడం విశేషం. మరోవైపు, తమపై దాడికి ప్రయత్నిస్తే ఇరాన్‌ వారసత్వ, చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. దీంతో మరోసారి మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఖాసీం అంత్యక్రియలకు పాలస్తీనాకు చెందిన హమాస్‌ నేత ఇస్మాయిల్‌ సహ పలువురు మిత్ర దేశాల సభ్యులు హాజరయ్యారు. బాగ్దాద్‌ విమానాశ్రయంపై అమెరికా రాకెట్‌ దాడిలో ఖాసింతోపాటు ఇరాక్‌ మిలీషియా నేత అబు మహదీ అల్‌ ముహందీస్‌ సైతం చనిపోయారు. ఆయనకు కూడా టెహ్రాన్‌లో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అమెరికా సైన్యం తమ పొరుగు దేశం ఇరాక్‌ను విడిచివెళ్లాలని అందరూ ముక్త కంఠంతో నినదించారు. ఇరాక్‌ పార్లమెంటు సైతం విదేశీ సైనికులను దేశం నుంచి పంపేయాలని తీర్మానం చేసింది. దీనిపై ఇరాక్‌ ఆపద్ధర్మ ప్రధాని అబ్దుల్‌ మహదీ మాట్లాడుతూ.. దేశం అంతర్గతంగా, బయట ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సూతప్రాయంగా ఇది ఇరాక్‌కు అత్యంత ఉత్తమైనదని అన్నారు.