హైదరాబాద్ : కూకట్పల్లిలో ఓ యువకుడి కిడ్నాప్ ఉదంతం కిడ్నాప్ కలకలం రేపింది. సీఐ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సనత్నగర్కు చెందిన షేక్ రహీం(21) కూకట్పల్లిలోని ఐసీసీఎస్ అనే కాల్సెంటర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి విధులు ముగించుకుని వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అప్పటికే అందులో ఉన్న నలుగురు వ్యక్తులు అతడిని కొట్టి కిడ్నాప్ చేశారు. బ్యాగ్, పర్సు తీసుకున్నారు. రహీం తల్లి రేష్మకు ఫోన్ చేసి మీ కుమారుడిని కిడ్నాప్ చేశామని, వెంటనే రూ. 3లక్షలు పంపాలని డిమాండ్ చేశారు. అతడిని గాయపర్చిన, గొంతుపై కత్తిపెట్టి ఉన్న ఫొటోలను ఆమె వాట్సా్ప్కు పంపారు. కొద్దిసేపటి తర్వాత మరోసారి ఫోన్ చేసి రూ. 50 వేలు పంపితే రహీంను విడిచిపెడతామని, లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. భయపడ్డ రహీం తల్లిదండ్రులు ఫోన్ పే ద్వారా రూ.10 వేలు పంపారు. అతడి తండ్రి రఫీ ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్లలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నగదు లావాదేవీల విషయంలో తెలిసిన వ్యక్తులే రహీంను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కిడ్నాప్ కలకలం