దీపావళి తరవాత యూనివర్సిటీల ప్రారంభం: పాపిరెడ్డి


హైదరాబాద్‌,నవంబర్‌11(జనంసాక్షి): దీపావళి తర్వాత విశ్వ విద్యాలయాలు పునఃప్రారంభిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి ప్రకటించారు. డిసెంబర్‌ నుంచి హైస్కూల్స్‌, ఇంటర్మీడియట్‌ వారికి ఫిజికల్‌ క్లాసులు ఉండొచ్చన్నారు. డిగ్రీ విద్యార్థులకు 30 శాతం సిలబస్‌ తగ్గిస్తామని పాపిరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కూడా సిలబస్‌ తగ్గించాలనుకుంటున్నామన్నారు. మార్చిలో టెన్త్‌ పరీక్షలు, ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలితే మళ్లీ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ క్లాసులు డిసెంబర్‌ నుంచి ప్రారంభమవుతాయని పాపిరెడ్డి ప్రకటించారు.