డబ్బులు పంచితే చెప్పాలని వెల్లడి
విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్య
ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేసామని వివరణ
హైదరాబాద్,నవంబర్30 (జనం సాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. పోలీసులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేస్తున్నామన్నారు. బాధ్యతగల వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. బండి సంజయ్పై లీగల్ ఒపీనియన్కు వెళ్తున్నామన్నారు. కేసులు పక్కాగా నమోదు చేస్తామని సజ్జనార్ తెలిపారు. డబ్బులు పంచుతునట్టు సమాచారం ఉంటే పోలీసులకు సమాచారమివ్వాలి.. కానీ నేరుగా నేతలు ఇంకో పార్టీ స్థావరాలపైకి వెళ్లొద్దని సీపీ సజ్జనార్ సూచించారు. ఇకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. బల్దియా ఎన్నికల కోసం 13,500 మంది పోలీసులతో అన్ని భద్రతాపరమైనా ఏర్పాట్లు చేశామని అన్నారు. వీరిలో 10,500 మంది సివిల్, 3000 మంది ఏఆర్ సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విూడియాతో మాట్లాడారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి మూడు సార్లు తర్ఫీదు ఇచ్చామన్నారు.
ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐ, సీఐ స్థాయి అధికారి, ఏసీపీ, ఏడీసీపీ, డీసీపీల నేతృత్వంలో భద్రత ఏర్పాటు చేశామన్నారు. 38 స్టయ్రికింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్టయ్రికింగ్ ఫోర్స్, 9 సీపీ రిజర్వ్ టీమ్స్, 11 ప్లయింగ్ స్క్వాడ్స్, 11 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు అందుబాటులో ఉంటాయన్నారు. 73 హైపర్ సెన్సిటివ్ పికెట్లు నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని సజ్జన్నార్ అన్నారు. హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఒక ఎస్ఐ, 4 ఏఆర్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్లో 38 వార్డ్లు, 2,437 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
1,421 నార్మల్ పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయన్నారు. అలాగే తమ పరిధిలో 766 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు, 250 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఈ మేరకు 177 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఇకపోతే సైబరాబాద్ పరిధిలో 15 బార్డర్ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామన్నారు. 587 లైసెన్సెడ్ గన్స్ డిపాజిట్ చేయడం జరిగిందని, 369 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామన్నారు. రూ.15 లక్షలు విలువ చేసే 396 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
ప్రతి పోల్ల్లింగ్ స్టేషన్కు జియో ట్యాగింగ్ చేసి, సోషల్ విూడియాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. పెండింగ్లో ఉన్న 24 మంది పై నాన్ బెయిలబుల్ వారెంటీలు ఎగ్జిక్యూట్ చేశామని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిసిటివి లు ఏర్పాటు చేసి వాటిని ఎలక్టాన్రిక్ ఎ/-లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేశాం. జియో ట్యాగింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని అనుసంధానం చేశాము.1 లక్ష సీసీ కెమెరాలు ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను మానిటరింగ్ చేస్తున్నాము. డీసీపీ, ఏసీపీ ఆఫీస్లో రౌండ్ ది క్లాక్ నిరంతర పర్యవేక్షణ ఉంచాము. ఎన్నికల అనంతరం లైవ్ స్టీమ్రింగ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ వద్ద నిఘా ఉంచామన్నారు.
ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు
హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటర్లను తరలించడం చట్ట విరుద్ధం అలా చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని, కోవిడ్ నియమ నిబంధనలు పాటించి ఓటింగ్లో పాల్గొనాలన్నారు.
బండి ఆరోపణలపై సజ్జనార్ ఆగ్రహం