తిరుమల,నవంబర్11(జనంసాక్షి) : తిరుమలలోని ఓ అతిథి గృహంలో ప్రమాదం చోటు చేసుకుంది. అతిధి గృహంలోని లిప్ట్ బుధవారం ప్రమాదానికి గురవడంతో ఓ భక్తుడు గాయపడిన సంఘటన స్తానికంగా ఆందోళన కలిగించింది. అతిథి గృహంలో కరెంట్ నిలిచిపోవడంతో రన్నింగ్లో ఉన్న లిప్ట్ ఆగిపోయింది. దీంతో భక్తులను లిప్ట్ నుంచి బయటకు దించే క్రమంలో ఓ భక్తుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సిబ్బంది వెంటనే తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన భక్తుడిని వెంకటగిరికి చెందిన జయప్రకాశ్గా అధికారులు గుర్తించారు.
తిరుమల లిఫ్ట్ ప్రమాదంలో భక్తుడికి గాయాలు