తెలంగాణలో కరోనాతో మరో ముగ్గురు మృతి


హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గతరాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,015 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,54,666కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,393కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,716 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,35,950కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,323 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 14,694 మంది ¬ం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 47,70,004కి చేరింది.