మన ఆడబిడ్డలకు బతుకమ్మ చీర


` తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుక

` చీరల పంపిణీ కార్యక్రమానికి అన్ని చర్యలు తీసుకున్నాం

` పథకంతో ఆడబిడ్డలకు అందమైన చీరతోపాటు, నేత కార్మికుల  జీవితాల్లో వెలుగులు నిండాయి 

` ఈ సంవత్సరం  30 సరికొత్త  డిజైన్లలో, 20 విభిన్న రంగులతో కలిపి మొత్తం 810 రకాల  చీరల తయారీ 

` రాష్ట్రంలో పవర్‌ లూమ్‌ పరిశ్రమ బలోపేతానికి ఈ కార్యక్రమం నాంది పలికింది 

` మంత్రి కే.తారకరామారావు వెల్లడి

హైదరాబాద్‌,అక్టోబరు 2(జనంసాక్షి):తెలంగాణ  ఆడపడుచులకు ప్రభుత్వం తరపున  బతుకమ్మ పండగ కోసం చీరల పంపీణీ ప్రారంబించినట్టు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమం పూర్తి అయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నట్టు కెటియార్‌ తెలిపారు. 18 సంవత్సరాలు నిండి ఆహార భద్రత కార్డ్‌ కింద నమోదు అయిన అర్హూలైన ప్రతి ఒక్క అడబిడ్డకు బతుకమ్మ చీర అందిస్తామని, ఇప్పటికే అన్ని గ్రామాలల్లో చీరల పంపీణీ కార్యక్రమానికి అవసరం అయిన ఎర్పాట్లు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. కరోనా నేపథ్యంలో స్దానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు పంపిణీని కార్యక్రమాలకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించుకున్నారన్నారు. తెలంగాణలోని నేతన్నలకు గౌరవప్రధమైన అదాయం కల్పించడం, తెలంగాణ పండగ బతుకమ్మ పూట అడబిడ్డలకు చీరను అందించే రెండు ఉద్దేశ్యాలతో 2017లో బతుకమ్మ చీరల తయారీ  కార్యక్రమాన్ని ప్రారంభించిందని కెటియార్‌ తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వతా రాష్ట్రంలోని మరమగ్గాల నేతన్నలకు నిరంతరం పని కల్పిస్తూ వారి జీవన స్థితిని, వారి నైపుణ్యాన్ని పెంచగలిగామని, ఈ ప్రాజెక్టు తాలుకు సానూకూల ఫలితాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయని కెటియార్‌ అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం  అయిన తర్వతా  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవర్‌ లూమ్‌ కార్మికుల వేతనాలు రెట్టింపు అయ్యాయన్నారు. తెలంగాణలోని సూమారు 20వేల మంది పవర్‌ లూమ్‌ నేత కార్మికులకు చేతి నిండా పని దొరికిందన్నారు. దీంతో గతంలో అత్మహత్మలు చేసుకున్న నేతన్నల కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. ఈ ప్రాజెక్టుతో నేత కార్మికుల నైపుణ్యాన్ని పెంచగలిగామని, వారిప్పుడు నూతన డిజైన్లు, వివిధ రకాల వస్త్రాలను ఉత్పత్తి  చేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో పవర్‌ లూమ్‌ పరిశ్రమను మరింతగా వృద్ది చేయాలన్న ప్రభుత్వ అలోచనలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం బలమైన అంశంగా మారిందన్నారు. ఇప్పటి దాకా 2017 నుంచి గత ఎడాదిదాకా మూడు కోట్ల 90 లక్షల చీరలను పంపీణీ చేశామన్నారు. 2017 లో 95, 48,439, 2018 లో 96,70,474, 2019 లో 96,57,813, 2020 లో 96,24,384 చీరలను ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా పంపిణి చేసిందన్నారు. ప్రతి ఎడాదికేడాది చీరల తయారీ, పంపీణి ప్రక్రియలో మార్పులు తీసుకువస్తున్నామని కెటియార్‌ తెలిపారు. చీరల నాణ్యత, డిజైన్లు, రంగుల ఎంపిక వంటి వాటిలో రాష్ట్రంలోని మహిళలకు క్షేత్ర స్థాయి నుంచి ప్రాతినిధ్యం ఉన్న మెప్మా, సెర్ప్‌ స్వయం సహాయక బృందాల్లోని మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు  తీసుకుని, నిఫ్ట్‌ డిజైనర్లతో రూపోందించిన డిజైన్‌ పాటర్న్‌ లతో ఈసారి తమ శాఖ చీరలను సిద్దం చేసిందన్నారు. గత నాలుగు సంవత్సరాల అనుభవం, నైపుణ్యాభివృద్ది నేపథ్యంలో నేతన్నలు నూతనంగా డాబీ/జాకార్డ్లు  డిజైన్లతో చీరలను ఉత్పత్తి చేసారన్నారు. ఈ సంవత్సరం 30 సరికొత్త డిజైన్లలో, 20 విభిన్న రంగులతో కలిపి మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకురావటం జరిగిందన్నారు. ఈ చీరలన్నీ జరీ అంచులతో తయారు చేయబడిన 100% పాలిస్టర్‌ ఫిలిమెంట్‌ / నూలుతో తయారు చేయబడ్డాయన్నారు. ఈసారి 6.30 విూటర్ల పొడవుగల ఒక కోటి సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 విూటర్లు పొడవు గల చీరలు 8 లక్షల చీరలు పంపీణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఈసారి మొత్తం రూ. 333.14 కోట్ల ఖర్చు చేయనున్నట్లు మంత్రి కెటియార్‌ తెలిపారు.