తెలుగు వర్సిటీ కోర్సులకు గగడువు పెంపు


హైదరాబాద్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి) హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో పలు పీజీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. నేటితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసి నప్పటికీ.. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్‌ 21 వరకు గడువును పొడిగించారు. ఆలస్య రుసుంతో ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఏడాది పలు నూతన కోర్సులను ప్రవేశపెట్టారు. ఇందులో ఎంఎఫ్‌ఏ (మాస్టర్స్‌ ఇన్‌ శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్‌ మేకింగ్‌), ఎంఏ (చరిత్ర, టూరిజం) కోర్సులు ఉన్నాయి. ఎంఫిల్‌ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పించనున్నారు. వివరాలకు లిలిలి.బి।్గªబీణబీబీనితిల।సబతిబా.జీఞ.తిని, లిలిలి.ªఔబబిబీఞ।బి.నీసణ వెబ్‌సైట్లను చూడాలని సూచించారు.