భవిష్యత్‌ అంతా విద్యుత్‌ వాహనాలదే


ఎలక్ట్రిక్‌ వాహనాలతో ఇంధనం ఆదా

ప్రదర్వనను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి
హైదరాబాద్‌,అక్టోబర్‌29 ( జనం సాక్షి ) భవిష్యత్‌లో ఇక అంతా విద్యుత్‌ వాహనాలదేనని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే ఇంధన కొరతను అధిగమించగలమని అన్నారు. అందులో భాగమే విద్యుత్‌ వాహనాల ప్రదర్శన అని ఆయన పేర్కొన్నారు. టి యస్‌ రెడ్కో ఆధ్వర్యంలో ఈవి ట్రెడ్‌ ఎక్స్పో విద్యుత్‌ వాహనాల ప్రదర్శన ను ఆయన శుక్రవారం ఆయన ప్రారంభించారు. విద్యుత్‌ వాహనాల అమ్మకాలను మాత్రమే కాకుండా ఇక్కడే తయారు చేసే విదంగా పారిశ్రామిక వేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు. అంతే గాకుండా విద్యుత్‌ వాహనాల కవసరమైన బ్యాటరీ పరిశ్రమలను తెలంగాణ లో నెలకొల్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ 10 వేల విద్యుత్‌ మోటారు సైకిళ్ళు వినియోగంలోకి వచ్చిన్లటైతే సంవత్సరానికి 250 కోట్ల రూపాయల పెట్రోల్‌ దిగుమతులు ఆదా చేసినవారమవుతామన్నారు. ప్రపంచానికి పర్యావరణ కాలుష్యం చాలెంజ్‌ గా మారిన నేపధ్యంలో విద్యుత్‌ వాహనాల వాడకం తప్పనిసరైందని ఆయన చెప్పారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ఐటి, పురపాలక,పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్‌ విద్యుత్‌ వాహనాల ను ప్రోత్సాహించడం తో పాటు వాహనాలు తయారీ చేస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు. వాడకంలోకి వచ్చిన విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ కు సందేహ పడొద్దని ఇప్పటికే 138 ఛార్జింగ్‌ కేంద్రాలను ప్రారంభించినట్లు మరో 600 ఛార్జింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా ఉన్నందున ఏ ఒక్కరూ విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ విషయంలో భయపడొద్దని మంత్రి జగదీష్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.పర్యావరణ కాలుష్యం మానవ జాతి మనుగడకే చాలెంజ్‌ గా మారిందని ఆయన చెప్పారు.అటువంటి చాలెంజ్‌ లను ఎదుర్కోవడానికి విద్యుత్‌ వాహనాల వాడకం తప్పని సరైందన్నారు.పొగ మంచుతో పాటు పర్యావరణ కాలుష్యం విడుదల చేస్తున్న పొగ తో దేశ రాజధాని కొత్త ఢల్లీితో పాటు బీజింగ్‌ ,చైనా వంటి ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ,టి యస్‌ రెడ్కో వి సీఎండి జానయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన ప్రారంభోత్సవం అనంతరం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు.