బెజవాడ ఉత్సవాల్లో అన్యమత ప్రచారమా


ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సోము వీర్రాజు

విజయవాడ,అక్టోబర్‌8 (జనంసాక్షి) : బెజవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల్లో అన్యమత ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం చేస్తున్న హిందూధర్మ ప్రచార కార్యక్రమాల్లో ! కైస్త్రవ మత ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారని సోము వీర్రాజు మండిపడ్డారు.ఈ ప్రభుత్వానికి అసలు హిందూ ధర్మం విూద ఏమాత్రం గౌరవం లేదని, హిందూ ధర్మ వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతి నిత్యం ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా, పాలకుల అలసత్వం ` అధికారుల నిర్లక్ష్యంతో అన్యమత ప్రచారానికి ప్రోత్సహిస్తున్నట్లుగా కనపడుతోందని సోము వీర్రాజు తీవ్రంగా విమర్శించారు. దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్‌ స్వీయ పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రకటించుకున్న ప్రభుత్వం, ఈ ఘటనపై ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నిస్తూ....ఇప్పటికే పదుల సంఖ్యలో మత ప్రచార బోధకులు ఇంద్రకీలాద్రి చుట్టూ ’అన్యమత ప్రచారం సాగిస్తూ,మతమర్పిడులు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ఈ సంఘటనలపై వెంటనే అధికార యంత్రాంగం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.