నిర్మల్,నవంబర్6 (జనంసాక్షి): మిడ్డే విూల్స్లో ఫుడ్ పాయిజనింగ్ కావడంతో నిర్మల్ జిల్లాలో 32 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. మామడ మండలంలోని దిమ్మదుర్తి యూపీఎస్లో రోజూలాగే శుక్రవారం మధ్యాహ్నం 114 మంది విద్యార్థులు భోజనం చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికి వారిలోని 32 మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. టీచర్లు అందరిని108లో పీహెచ్ సీకి తరలించారు. ఎవరికీ ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. విషయం తెలుసుకున్న డీఈఓ రవీందర్ రెడ్డి ఘటనపై కలెక్టర్కు రిపోర్టు పంపారు. నిర్మల్ డీఎంహెచ్ఓ ధన్ రాజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీకాంత్ బాధిత స్టూడెంట్స్?కలిసి టెస్టులు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో హెడ్మాస్టర్ వినోద్ కుమార్ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ రవీందర్ రెడ్డి ప్రకటించారు. అలాగే మిడ్డే విూల్స్ ఏజెన్సీని తొలగించినట్లు వెల్లడిరచారు.
మధ్యాహ్న భోజనం వికటించి 32మందికి అస్వస్థత