రాష్ట్రపతిగా చూడాలని ఉందంటూ ఆకాంక్ష
మోడీ నాయకత్వంలో బిజెపి నిర్ణయంతోనే సాకారం
హైదరాబాద్,నవంబర్18(జనం సాక్షి ): భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు మరింత ఉన్నతమైన రాష్ట్రపతి పదవి అధిష్టించాలని నటుడు చిరంజీవి మంగళవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన మనసులో మాట బయటపట్టారు. నిజంగా ఆయన పైకి అన్నారు. ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను చిరంజీవి చాటారు. మాలవేసుకున్న చిరంజీవి అయ్యప్ప సాక్షిగా వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు అనిర్వచనీ యమని కొనియాడారు. ఇంతకీ వెంకయ్యనాయుడుకి రాష్ట్రపతిగా సేవలందించే అవకాశం ఉంటుందని భావిస్తే అంతకన్నా అత్యాశ మరోటి ఉండదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ వెంకయ్యనాయుడు కన్నా జూనియర్. వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నారు. ఆయన గురువైన అద్వానీకి రాష్ట్రపతి పదవి రాకుండా అడ్డుకుని,వయసును సాకుగా చూపి పక్కన పెట్టిన మోడీకి ..వెంకయ్యనాయుడు ఓ లెక్క కాదు. నిజానికి వెంకయ్యాను రాజకీయాలనుంచి తప్పించడడానికే మోడీ ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చ మూలన కూర్చోబెట్టారు. మోడీ రాజకీయాలు చూశాక వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావడం అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాథ్యం అని గుర్తించాలి. పాపం రాజకీయాలు పెద్దగా వంటబట్టని చిరంజీవి తన మనోగతాన్ని బయటపెట్టుకున్నారు. దేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ పదవి చేపట్టిన వెంకయ్య నాయుడు పదవీవిరమణతరవాత ఇక విశ్రాంతి తీసుకుంటుమని ప్రకటించారు. ఆయన ఆషామాషీగా ఈ ప్రకటన చేయలేదు. కేంద్రం నడుస్తున్న రాజకీయాల్లో ఇక ఇమడలేక ఆయన ముందే తన నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది రాష్ట్రపతి భవన్లోకి ఐదు సంవత్సరాలు ఉండడానికి వచ్చేది ఎవర్నది ..మోడీ మనసులో ఉన్న వ్యక్తి మాత్రమే కాగలడు. ఉప రాష్ట్రపతి పదవిలో ఐదేళ్లు కొనసాగిన తరవాత విశ్రాతం జీవితం గడుపుతానని అంటున్నారు. ఐదేళ్లు ప్రధానిగా కొనసాగి బీజేపీని రెండోసారి గెలిపించిన ప్రజాకర్షక నేతగా మోడీ తనదైనరాజకీయాలు నడుపుతున్నారు. ఇప్పడుఉ బిజెపి రాజకీయాలు అనేకన్నా మోడీ రాజకీయం మాత్రమే నడుస్తోంది. వెంకయ్యనాయడు 2017లో ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మరో ఏడాది తరవాత ఆయన పదవీవిరమణచేస్తారు. ఇదే ఆయనకు చివరి పదవి అవుతుందని బిజెపి రాజకీయాలు తెలిసిన వారికి మాత్రమే అర్థం అవుతుంది. గతంలో అనేకులు ఉపరాష్ట్రపతిగా పసనిచేసి తరవాత రాష్ట్రపతి అయ్యారు. ఆనాటి పరిస్థితులు వేరు. నేటి పరిస్థితులు వేరు. వెంకయ్యనాయుడు సహా 13 మంది ఉపరాష్ట్రపతి పదవి చేపట్టారు. వెంకయ్యకు ముందు ఈ పదవిలో ఉన్న పన్నెండు మందిలో ఇద్దరిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, మహ్మద్ హవిూద్ అన్సారీ వరుసగా రెండేసిసార్లు వైస్ ప్రెసిడెంట్ పదవి నిర్వహించారు. మొదటి ముగ్గురు ఉపరాష్ట్రపతుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వరహాగిరి వెంకట రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. వారి తర్వాత వరుసగా ఉపరాష్ట్రపదవి అధిష్ఠించిన ముగ్గురు నేతలు ఆర్.వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్.నారాయణన్ రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. అయితే ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగాయి. ఇప్పుడు మోడీ నేతృత్వంలోని బిజెపి ఏలుతోంది. అద్వానీ, వాజ్పేయ్ లాంటి వారి నాయకత్వంలో ఉన్న బిజెపి కాదు. అందుకే అద్వానీకే రాష్ట్రపతి అయ్యే అవకాశం దక్కలేదు. అందువల్ల వెంకయ్యనాయుడుకు చిరు ఆశించినట్లు రాష్ట్రపతి అయ్యే అవకాశం వస్తుందని అనుకోవడానికి లేదు. వాజ్పేయి ప్రభుత్వంతో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా నాయుడు కేబినెట్ మంత్రి అయ్యారు. మొదట మంత్రి పదవి వద్దని వెంకయ్య చెప్పినా, మోదీ నచ్చజెప్పి, ఒప్పించా రనే వార్తలు వచ్చాయి. 2017లో ఆయనను ఉపరాష్ట్రపతిని చేశాయి. పార్లమెంటులో 47 ఏళ్లు, ఉప ప్రధానిగా కొన్ని సంవత్సరాలు వాజ్పేయి సర్కారులో పనిచేసిన ఆడ్వాణీకి 2014లో ప్రధాని కావడానికి ఆయన వయసు అడ్డంకిగా మారింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2017 జులైలో 71 సంవత్సరాల వయసులో అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. ఆయనస్థానంలో అద్వానీకి అవకాశంఉన్నా మోడీ అడ్డుకున్నారని జగమెరిగిన సత్యం. కాబట్టి వెంకయ్యకుప్రమోషన్ రావాలని మనం కోరుకున్నా మోడీ అనుగ్రహంకావాల్సిందే.