యాదాద్రికి పోటెత్తిన భక్తులు

   

యాదాద్రి`భువనగిరి,నవంబర్‌19(జనం సాక్షి  ) : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని యాదాద్రిలో భక్తుల తాకిడిపెరగింది.  స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధనలతో భక్తులు మొక్కులు చెల్లించారు. అటు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే  శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, వాడపల్లి అగైస్థశ్వర స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. నదీ తీర ఆలయాల వద్ద  భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు.