మానేరు వాగులో ఆరుగురు బాలల గల్లంతు దిగ్భార్రతి వ్యక్తం చేసిన కెటిఆర్‌,వినోద్‌

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగులో ఈత కోసం వెళ్లిన ఆరుగురు విద్యార్థుల గల్లంతయ్యారు. మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల మంత్రి కెటిఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన జిల్లా అధికారులతో మంత్రి కెటిఆర్‌ మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నియోజకవర్గంలోని జలవనరుల  సంపూర్ణంగా నిండి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వహించాలని కెటిఆర్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కెటిఆర్‌ సూచించారు. ప్రభుత్వం తరఫున ఆయా కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి కెటిఆర్‌ భరోసా ఇచ్చారు.  ఈ ఘటనపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ దిగ్భాంª`రతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి ఆరా తీశారు. మిగతా వారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కలెక్టర్‌ కు వినోద్‌ కుమార్‌ సూచించారు. మృతి చెందిన ఇద్దరి విద్యార్థులు వెంకటసాయి, కొలిపాక గణెళిష్‌ ల కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ను కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను పేర్కొన్నారు.