అపార్ట్‌మెంటులో చోరీ


హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ): రాజేంద్రనగర్‌ పోలీస్టేషన్‌ పరిధి హైదర్‌ గుడా నలందనగర్‌లోని కర్ణితామర అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ జరిగింది. కర్ణితామర అపార్ట్‌మెంట్‌ ఎª`లాట్‌ నంబర్‌ 312 ప్లాట్‌లో నివాసముంటున్న అర్జున్‌ అనే వ్యాపారి ఇంట్లో ఐదు లక్షల చోరీ జరిగింది. రాజేంద్రనగర్‌ పోలీస్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో పని మనిషి లక్ష్మిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు అర్జున్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనుమానితురాలిని అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.