ధాన్యం తీసుకుని వచ్చి అమ్మకం కోసం పడిగాపులు
తేమ పేరుతో దోపిడీ చేస్తున్నా పట్టించుకోరు
అకాల వర్షాలతో తడిసిన ధాన్యంతో మరింత ఆందోళన
ఎఫ్సీఐ నిబంధనల ప్రకారమే కొనుగోళ్లకు అంగీకారం
హైదరాబాద్,నవంబర్ 23(జనం సాక్షి ):
ధాన్యం కొనుగోలు మొదలుపెట్టి దాదాపు నెలరోజులవుతున్నా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కావడంలేదు. ప్రతిరోజూ భారీగానే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా రైతులకు ఇబ్బందులు తొలగడం లేదు. దీనికితోడు అకాల వర్షృాలతో అన్నదాతలు ఆందోళన చెందు తున్నారు. కల్లాల్లో ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోయింది. దీనిపై ఎలాంటి హావిూ రావడం లేదు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన తగినంత మందిని నియమించకపోవడం, వాహనాలు, హమాలీలను సమకూర్చకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ప్రతి కొనుగోలు కేంద్రం పరిధి లో వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇచ్చిన తగినంతమంది సిబ్బంది లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొన్ని సహకార సొసైటీల పరిధిలో మిల్లులను కేటాయిం చకపోవడం వల్ల తరలింపునకు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో జిల్లాల్లో ధాన్యం అమ్మకాలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతులకు నిరీక్షణ తప్పడంలేదు. రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండాల్సి వస్తోంది. అకాల వర్షాలను తట్టుకుంటూనే ధాన్యం అమ్మకాలు చేస్తున్న ధాన్యాన్ని వెంటనే తరలించకపోవడం వల్ల ప్రతీ రైతు 20 నుంచి 25 రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తోంది.చివరి గింజవరకు కొంటామని హావిూ ఇస్తున్నా కొనుగోలు వ్యవహారాలను ప్రబుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రైతుల నుంచి నిత్యం ధాన్యం కొనుగోలు చేస్తునా ఇంకా వేలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. అలాగే ధాన్యం కనుగోళ్లలో క్వింటాలుకు 4 నుంచి 5 కిలోల తరుగు తీస్తే తప్ప అమ్మకాలు జరగడంలేదు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం 17లోపు ఉన్నవాటికి క్వింటాలుకు ఏ గ్రేడ్ 1960 రూపాయలు, బీ గ్రేడ్కు 1940 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం అమ్మిన పది రోజుల పాటు రైతులు కుప్పల వద్దనే కావాలి ఉంటే తప్ప ధాన్యాన్ని తరలించడంలేదు. మిల్లులకు వెళ్లిన తర్వాత ధాన్యం తేమగా ఉంది, తాలు, మట్టి ఉందని మరో 2కిలోల వరకు తీస్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండడంతో క్వింటాలుకు 5కిలోల వరకు నష్టం జరిగినా రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పడంలేదు. ధాన్యం అమ్మిన రైతులకు త్వరగా డబ్బులు రావడంలేదు. రోజుల తరబడి డబ్బుల కోసం వేచిచూడాల్సి వస్తోంది. సహకార సొసైటీల పరిధిలో ట్యాబ్ ఎంట్రీ సకాలంలో చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాప్ట్వేర్లో మార్పులు చేయడం, ఆధార్కు రైతుల ఫోన్ నంబర్లు అనుసంధానం కాకపోవడం వల్ల ట్యాబ్ ఎంట్రీ ఆలస్యం కావడంతో చెల్లింపులు కావడంలేదు.ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సీఐ నిబంధనలు పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తీసుకొనేందుకు నిరాకరిస్తోంది. నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే ఎలాంటి ఆలస్యం చేయకుండా కొనుగోలు చేస్తారు. నిబంధనలు పాటించకుండా ధాన్యం కొనడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల లాభం లేదు. రైతులు తమ ఫోన్ నంబర్ను ఆధార్తో అనుసం ధానం చేసుకున్న తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే సమయంలో ఓటీపీ కోసం ఫోన్ను రైతు వద్దే ఉంచుకోవాలి. ఓటీపీ వచ్చిన తర్వాతే ధాన్యం కొనుగోలు పక్రియ ప్రారంభమవుతుంది.