హైదరాబాద్,నవంబర్ 23 (జనంసాక్షి): తక్కువ దరఖాస్తులు వచ్చి లక్కీడ్రా ఆగిపోయిన మద్యం దుకాణాలకు రెండు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా.. 43 దుకాణాలకు పదిలోపు దరఖాస్తులు రావడం, భూపాలపల్లి జిల్లాలోని రెండు దుకాణాలపై కోర్టులో కేసు ఉన్నందున డ్రా నిర్వహించలేదు. ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలతో ఆయా జిల్లాల ఎక్సైజ్శాఖ అధికారులు దరఖాస్తులు తక్కువ రావడానికి గల కారణాలను పరిశీలించి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. దరఖాస్తుకు వారం రోజులు అవకాశం ఇవ్వనున్నారు. డిసెంబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి రానున్న నేపథ్యంలో ఆలోపు పక్రియను పూర్తిచేయనున్నట్టు వెల్లడిరచారు.