అండర్‌`19లో రషీద్‌,రిషిత్‌ రెడ్డిలకు చోటు


న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి ): అండర్‌`19 ప్రపంచ కప్‌ లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రా ఆటగాడు షేక్‌ రషీద్‌, హైదరాబాదీ ప్లేయర్‌ రిషిత్‌ రెడ్డిలకు చోటుదక్కింది. వెస్టిండీస్‌లో వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జూనియర్‌ వరల్డ్‌కప్‌ జరగనుంది. యాష్‌ ధూల్‌ సారథిగా మొత్తం 17 మంది సభ్యుల జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. గుంటూరుకు చెందిన రషీద్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. కాగా, హైదరాబాద్‌ క్రికెటర్‌ రిషిత్‌ రెడ్డి స్టాండ్‌ బైగా సెలెక్టయ్యాడు.