మురళికి ప్రాణరక్షణ కల్పించండి

డిజిపికి చంద్రబాబు లేఖ

అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి):చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి ఘటన పై టిటిడి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్‌ సవాంగుకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మురళీకి ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు మురళికి రక్షణ కల్పించాలంటూ డిమాండ్‌ చేశారు. మురళిని కిడ్నాప్‌ చేసి కొట్టడమేకాకుండా.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. నిందితులను తక్షణమే పోలీసులు అరెస్ట్‌ చేయాలంటూ చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలంటు కోరారు.