స్టేషన్లలో పరిశుభ్రతకు పెద్దపీట

  

ప్రజలకు సూచనలు చేస్తున్న సిబ్బంది

హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనం సాక్షి); నిత్యం నేరస్థులను పట్టుకునే క్రమంలో శ్రమిస్తున్న పోలీసులు ఇప్పుడు కోరానపైనా పోరాడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఒమైక్రాన్‌ విజృంభనతో కొందరు తమ వివరాలను గోప్యంగా ఉంచడంతో వారి వివరాలు సేకరిస్తున్నారు. అలా వచ్చిన వారిలో ఎవరికైనా ఒమిక్రాన్‌ ఉందా అన్న భయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కొందరు తమ అడ్రస్‌ ఇవ్వకుండా పోయారన్న నేపథ్యంలో ఈ వేట మొదయ్యింది. అలాగే వ్యక్తిగతంగా వారు కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలతో నిత్యం మమేకమవుతున్న క్రమంలో పోలీసులు కూడా ’కరోనా’ విషయంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. ఈ మేరకు నగరంలోని పోలీస్‌స్టేషన్లు, పెట్రోలింగ్‌ సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లను మళల్‌ఇ సిద్దంచేసుకుంటున్నాయి. పోలీస్‌స్టేషన్లలో నిత్యం వివిధ పనుల నిమిత్తం ప్రజలు వస్తుంటారు.. అలాంటి వారు రాగానే శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే సిబ్బంది కూడా తమ చేతులను శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.