లేకుంటే కెసిఆర్ దెబ్బ రుచి చూడక తప్పదు
కేంద్రానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరికహైదరాబాద్,డిసెంబర్24(జనం సాక్షి): రాష్ట్ర ప్రజలు, రైతాంగం తరఫున ఢల్లీికి వచ్చిన తెలంగాణ మంత్రులు, ఎంపీలను కేంద్రం అవమానిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ధాన్యం సేకరనకు సంబంధించి కేంద్రం తన విధానం ఏమిటీ ప్రకటించకుండా అవమానించడం దారుణమన్నారు. రైతుల కోసం ఢల్లీికి వెళ్ళిన ప్రభుత్వ ప్రతినిధులకు ఇచ్చే మర్యాద ఇదేనా అని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో విూడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలను కేంద్ర పెద్దలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడొద్దన్న మంత్రి.. యాసంగిలో వరిపంట వేయాలా వద్దా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కారు స్పందించని పక్షంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ వ్యూహమేంటో చూస్తారని అన్నారు. రైతుల కోసం కేంద్రం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్న మోడీ ఆ మాట మరిచిపోయారని మండిపడ్డారు.