నిరంతరాయంగా ధాన్యం కొరుగోళ్లు


కేంద్రం తీరుపై మండిపడ్డ గంగుల

హైదరాబాద్‌,డిసెంబర్‌13 (జనం సాక్షి) : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎఫ్‌సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పట్ల కేంద్రం, ఎఫ్‌సీఐ తీరు విచారకరమని వెల్లడిరచారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, నగదు చెల్లింపు అంశాలు చర్చకువచ్చాయి. గతేడాదికంటే 30 శాతం అధికంగా ధాన్యం సేకరించామని మంత్రి చెప్పారు. ధాన్యం రైతుల డబ్బు చెల్లింపులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఓపీఎంఎస్‌లో నమోదైన వెంటనే రైతులకు నగదు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.5447 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. 1280 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని వెల్లడిరచారు.