జనవరిలో సిఐటియూ సమావేశాలు

ఏలూరు,డిసెంబర్‌31 (జనంసాక్షి) : తాడేపల్లిగూడెంలో జనవరి 9,10,11 తేదీల్లో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు జరుగునున్నాయి. వీటిని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘ

నాయకుడు ఎం.ఆంజనేయులు అన్నారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు. పంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డులు, పీఎఫ్‌,ఈఎస్‌ఐ, వైఎస్‌ఆర్‌ బీమా పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.