ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను జమ చేయండి

  

సిఎస్‌కు వర్ల రామయ్య లేఖ

అమరావతి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :  సీఎం జగన్‌ రెండున్నరేళ్ల పాలనలో దళితులను అన్ని విధాల వంచించారరి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. దళితుల పేరు చెప్పి వారి నిధులను దారి మళ్లించారని కూడా అన్నారు. వారి సంక్షేమానికి టిడిపి ప్రభుత్వంలో అనేక చర్యలు తీసకున్నామని చెప్పారు. ఈ మేరకు జగన్‌ పాలనపై సీఎస్‌ సవిూర్‌ శర్మకు వర్ల లేఖ రాశారు. రెండున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి . 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి రూ.26,663 కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్ళించారన్నారు. ఆ నిధులను తిరిగి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే అయ్యిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్‌ భూములను అన్యాయంగా ప్రభుత్వం లాక్కుందని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు.