కేసీఆర్‌ అవినీతిపై యుద్ధం చేయండి

  


బియ్యం కుంభకోణంపైనా పోరాడండి
హుజూరాబాద్‌ తరహాలో ఇకముందు ఫలితాలు రావాలి
తరచూ ఇక తెలంగణాలో పర్యటిస్తానన్న అమిత్‌ షా
హోంమంత్రితో తెలంగాణ నేతల భేటీ
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన షా
న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవినీతిపై యుద్ధం చేయాలని బీజేపీ నాయకులకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా సూచించారు. ఇందులో ఎలాంటి వెనకడుగు వేయవద్దని, అవినీతిపై పోరాడాల్సిందేనని అన్నారు. మంగళవారం ఢల్లీిలో బీజేపీ తెలంగాణ నేతలు అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా వారు చర్చించారు. దీంతో తెలంగాణలో కెసిఆర్‌ అవినీతిపై పోరాడాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరిగిన బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలన్నారు. కేసీఆర్‌ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. హుజురాబాద్‌ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా విూరు చేయాల్సింది విూరు చేయండి.. ప్రభుత్వపరంగా ఏమి చేయాలో తమకు వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తానని నాయకులకు అమిత్‌షా హావిూ ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ సర్కార్‌ ల మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశంపై రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్దమే కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరిపై మరొకరు నిందించుకుంటున్నారు. ఈ తరుణంలోనే.. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు, రాష్ట్ర నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిశారు. ఈ సందర్భంగా నేతలను ఉద్ధేశించి అమిత్‌ షా దిశానిర్దేశర చేశారు. సీఎం కేసీఆర్‌పై ప్రత్యక్ష రాజకీయ సమరానికి సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు తాను రానున్నట్లు ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని.. కేసీఆర్‌ ట్రాప్‌లో పడకండంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్‌ షా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. హుజురాబాద్‌ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ మంత్రులు, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి , విజయశాంతి ఎమ్మెల్యేలు రఘునందన్‌ రావు, ఈటల రాజేందర్‌తో సహా పలువురు ముఖ్య నేతలంతా అమిత్‌షాతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని అమిత్‌షా ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా హాజరయ్యారు.