ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

`


కరోనా ఉధృతి ఉన్నా ఎన్నికల నిర్వహణకే ఈసీ మొగ్గు

` జనవరి 14న నోటిఫికేషన్‌ విడుదల
` ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీవరకు పోలింగ్‌
` మార్చి 10న ఎన్నికల కౌంటింగ్‌కు ముహూర్తం
` పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లలో ఒకే దశలో ఎన్నికలు
` ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహణ
` ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం
` వర్చువల్‌ ప్రచారానికి ప్రాధాన్యం
` ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లకు అవకాశం
` అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌
న్యూఢల్లీి,జనవరి 8(జనంసాక్షి): ఐదు రాష్టాల్ల్రో ఎన్నికల నగగారా మోగింది. కరోనా విజృంభిస్తున్నా.. జాగ్రత్తలతో ఎన్నికలకు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఏడు దశల్లో నిర్వహించనున్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) సుశీల్‌ చంద్ర తెలిపారు. ఈ సందర్బంగా ఢల్లీిలో కేంద్ర ఎన్నికల సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదురాష్టాల్ల్రోని ఎన్నికలను మొత్తం 7 దశల్లో నిర్వహిస్తామన్నారు. జనవరి14న యూపిలో తొలిదశ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. తొలిదశ పోలింగ్‌ తేదీ ఫిబ్రవరి 10,రెండో దశ పోలింగ్‌ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో దశ పోలింగ్‌ను ఫిబ్రవరి 20న నాలుగో దశ పోలింగ్‌ను పిబ్రవరి 23న,ఐదో తేదీ పోలింగ్‌ను ఫిబ్రవరి 27న, ఆరో దశ పోలింగ్‌ను మార్చి 3న, ఏడో దశ పోలింగ్‌ను మార్చి 7న ఎన్నికలు నిర్వహిస్తామని సిఈసి వెల్లడిరచారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీవరకు ఏడు దశల్లో పోలింగ్‌ను నిర్వహిస్తామని, మార్చి 10న ఏడు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని సీఈసీ వివరించారు. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం పంజాబ్‌ మినహా మిగిలిన నాలుగు రాష్టాల్లోన్రూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. కోవిడ్‌`19 మహమ్మారి పరిస్థితులను సవిూక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్‌ ఈ రాష్టాల్లో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఐదు రాష్టాల్ర ఏడుదశల్లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిబంధనలు కఠితరం చేయనున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించ నున్న ఐదు రాష్టాల్లోన్రూ ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి, ఐదు రాష్టాల్లోన్రి కరోనా పరిస్థితులను పరిశీలించారన్నారు. కోవిడ్‌ పెరుగుతున్నందున కొత్త నిబంధనలు పాటించి కరోనా సెఫ్‌ జోన్‌లోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సవిూక్షిస్తున్నామన్నారు. ఈ నేపధ్యంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామన్నారు. ఐదు రాష్టాల్లో మొత్తం మొత్తం 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 24.5 లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఇందులో అధిక శాంతం మహిళా ఓటర్లే ఉన్నారని వివరించారు. ఇందుకు అనుగుణంగా 2,15, 368 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థులు 40 లక్షల ఎన్నికల వ్యయం అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. వంటి అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించా మన్నారు. గోవా, మణిపూర్‌లలో అభ్యర్థులు 28 లక్షల ఎన్నికల వ్యయాన్ని నిర్ణయించామన్నారు. కోవిడ్‌ సోకిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు అనుమితించామన్నారు. కోవిడ్‌ వల్ల పోలింగ్‌ స్టేషన్లల్లో ఓటర్ల సంఖ్యను తగ్గించామని వివరించారు. ఐదు రాష్టాల్లో 900 మంది ఎన్నికల అబ్జర్వర్లను నియమించామన్నారు. డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్లు తీసుకున్న వారికే ఎన్నికల డ్యూటీ వేస్తున్నామన్నారు.ఒక్కో అభ్యర్థికి రూ.28 లక్షల నుంచి 40లక్షల వరకు వ్యయాన్ని పెంచామన్నారు. క్రిమినల్‌ కేసులు ఉండి పోటీ చేసే అభ్యర్థులకు వారి కుటుంబ నేపధ్యాన్ని పరిశీలించి సీట్లు కేటాయిస్తామన్నారు.ఇప్పటి నుంచే ఐదు రాష్టాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని వివరించారు. యూపిలో 90 శాతం మంది ఒక్క డోస్‌ వ్యాక్సినేషన్‌ తీసుకున్నారన్నారు.గోవాలో 97 శాతం మంది డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్లు తీసుకున్నారని, ఉత్తరాఖండ్‌లో 99 శాతం ఒక్క డోజ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారని వివరించారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఐదు రాష్టాల్లో గల పాజిటివిటి రేట్‌ను పరిశీలించామన్నారు. కోవిడ్‌ వల్ల ఎన్నికల సమయాన్ని ఒ గంట పొడిగిస్తున్నామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి వెంట ఇద్దరికి మాత్రమే అనుమతించామన్నారు. ఇందులో భాగంగా జనవరి 15 వరకు రోడ్డు షోలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల అధికారులకు కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌ ఇస్తున్నామని వివరించారు. ఎన్నికల వర్కర్లను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించామన్నారు. కోవిడ్‌`19 మహమ్మారి వల్ల ఎన్నికల నిర్వహణ భారీ సవాలుగా నిలుస్తోందని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు. ఈ ఎన్నికలను కోవిడ్‌ రహిత ఎన్నికలుగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇకపోతే 6 శాతం పోలింగ్‌ కేంద్రాలను పెంచుతున్నట్లు చెప్పారు. మొత్తం పోలింగ్‌ బూత్‌ల సంఖ్య 2.16 లక్షలు అని తెలిపారు. ఒక్కొక్క పోలింగ్‌ బూత్‌కు ఓటర్ల సంఖ్యను 1,250కి తగ్గించినట్లు చెప్పారు. న్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లను దాఖలు చేయవచ్చునని తెలిపారు. కోవిడ్‌ పాజిటివ్‌ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయవచ్చునని తెలిపారు. భారత ఎన్నికల సంఘం 5 రాష్టాల్లో ఎన్నికల సందర్భంగా కోవిడ్‌ ప్రోటోకాల్‌ను మరింత కఠినతరం చేయవచ్చు. దీంతో పాటు ఎన్నికల ర్యాలీల నిబంధనలను కూడా కమిషన్‌ కఠినతరం చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారులు, ఉద్యోగులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇది కాకుండా, ఎన్నికల హక్కు కారణంగా ఓటర్లకు తప్పనిసరిగా టీకాలు వేయవలసిన అవసరాన్ని కమిషన్‌ విధించదు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్ర శనివారం ఢల్లీిలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ శాసన సభ ఎన్నికల్లో జనవరి 15 వరకు రోడ్డు షోలు, పాదయాత్రలు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు. పార్టీలు వర్చువల్‌ విధానంలో ప్రచారం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఐదు రాష్టాల్లో మొత్తం 24.5 లక్షల కొత్త ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. అభ్యర్ధులకు ఆన్‌ లైన్‌ లో నామినేషన్‌ దాఖలు చేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అభ్యర్ధులపై నమోదైన క్రిమినల్‌ కేసుల్ని తప్పనిసరిగా టీవీ ఛానళ్లు, పత్రికల్లో బహిర్గతం
చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర సూచించారు.