ఇక చిన్నారులకు కూడా టీకా?

 

 



` 12నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌
` పరిశీలిస్తున్న కేంద్రం
న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి):భారత్‌లో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైనంది. ఇప్పుడు12 నుంచి 15 ఏళ్ల లోపు వారికి కూడా మార్చి నుంచి కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్రం ప్రారంభించే అవకాశముందని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వజరీ గ్రూప్‌ ఆప్‌ ఇమ్యూనైజేషన్కి చెందిన జాతీయ కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌.కె.అరోరా సోమవారం తెలిపారు. అప్పటి వరకు 15`18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే అవకాశముందన్నారు. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు 7.4 కోట్ల మంది ఉన్నారని, వారిలో 3.45 కోట్ల మంది తొలి డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. 28 రోజుల వ్యవధితో రెండో డోసు తీసుకుంటారన్నారు.