ఎమ్మెల్యే ఆరూరి ఇంటిని ముట్టడిరచిన కాంగ్రెస్‌

హనుమకొండ,జనవరి29 (జనంసాక్షి):   హనుమకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ఇంటిని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ముట్టడిరచారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వడం లేదంటూ..నిరుద్యోగి ముత్యాల సాగర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ముత్యాల సాగర్‌ కుటుంబానికి న్యాయం చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ..ఆరూరి రమేష్‌ ఇంటిని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ముట్టడిరచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని యూత్‌ కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.