జనం సాక్షి కథనానికి స్పందన... అఖిల కు 10,000 ఆర్థిక సాయం అందజేత

 


     మంథని, ఫిబ్రవరి 13, ( జనం సాక్షి ):  పెద్ద చదువులకు పేదరికం అడ్డంకి మెడికల్ స్టేట్ లెవెల్ లో నాలుగు వేల ర్యాంకు సాధించిన నిరుపేద విద్యార్థులు అఖిల దాతల సహాయం కోసం ఆశగా ఎదురు చూపు అనే శీర్షికతో జనంసాక్షి లో ఆదివారం ప్రచురితమైన కథనానికి స్పందించిన  పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన మాదాసు రవీందర్ ( ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ) పది వేల రూపాయలు తన వంతు సాయంగా ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం పంపించారు.  వైద్య విద్య అభ్యసించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు సేవ చేద్దామని ఎంతో ఆకాంక్ష ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు కొనలేక అయోమయం లో ఉన్న మెడికల్ స్టేట్ లెవెల్ లో నాలుగు వేల ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లాలోని సూరారం మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో సీటు సొంతం చేసుకున్నా.. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కమాన్ పూర్ మండలం గుండారం గ్రామం పంచాయతీ పరిధిలోని రాజాపూర్ అనే గ్రామానికి చెందిన అవునూరి అఖిల దీన గాథను జనంసాక్షి వెలుగులోకి లోకి తీసుకు రావడం జరిగింది. పేద కుటుంబంలో పుట్టిన తాను చదువు కొనే స్తోమత లేని విషయం తెలుసుకొని తన వద్దకు వచ్చి వివరాలు తెలుసుకుని వార్త గా ప్రచురించిన జనం సాక్షి పత్రిక కు స్పందించి తన వంతు సాయంగా పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మాదాసు రవీందర్ కు అఖిల, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.