బడ్జెట్‌లో బిసిలకు 3వేల కోట్లు కేటాయించాలి

హైదరాబాద్‌,ఫిబ్రవరి28(ఆర్‌ఎన్‌ఎ): వచ్చే బడ్జెట్‌లో బీసీలకు 3 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. క్రిష్ణయ్య అన్నారు. బీసీల సంక్షేమంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తే ఉరుకోబోమన్నారు. నిరుద్యోగులకు అందాల్సిన కార్పొరేషన్‌ లోన్స్‌, ఫీజు రియంబర్స్‌ మెంట్‌ వెంటనే ఇవ్వాలంటూ మంత్రి గంగుల కమలాకర్‌ కు వినతి పత్రం అందజేశారు బీసీ సంఘాల నేతలు. బీసీ హాస్టల్స్‌ లో చదువుతున్న విద్యార్ధులకు సరైన సౌకర్యాలు చేట్టాలని మంత్రిని కోరారు.