అశోక్‌బాబు అరెస్ట్‌ దారుణం

తీవ్రంగా ఖండిరచిన ఎంపి రఘురామ

న్యూఢల్లీి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టును ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండిరచారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌లో ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. జగన్‌ రెడ్డి డైరెక్ట్‌గా జైలుకు వెళ్లారు.. కాబట్టి ఏవిూ తెలియదన్నారు. అశోక్‌బాబు తండ్రి చనిపోతే ఆయనకు ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. లోకాయుక్తలో ప్రభుత్వానికి తెలిసిన వారితో పిటిషన్‌ వేయించి సీఐడీతో అశోక్‌బాబును అరెస్ట్‌ చేయించారని విమర్శించారు. అర్ధరాత్రి అరెస్ట్‌ ఏంటో అర్ధం కావడం లేదన్నారు. సీఎం జగన్‌కు.. సీఐడీకి ఉన్న బంధం ఏంటో తెలియదన్నారు. అశోక్‌బాబును అరెస్ట్‌ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని రఘురామ అన్నారు. అశోక్‌బాబు ఏమైనా తప్పు చేస్తే సర్వీస్‌ రూల్స్‌ యాక్షన్‌ తీసుకుంటుందని, కానీ సీఐడీకి అప్పగించడం ఏంటని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. లేని హక్కును కల్పించుకుని సీఐడీ అధికారులు అశోక్‌బాబుపై క్రిమినల్‌ కేసు పెట్టారని విమర్శించారు. అశోక్‌బాబుకు ఎలాంటి హాని చేయొద్దన్నారు. ఈ అరెస్టుపై రాష్ట్రపతి, కేంద్ర హోమంత్రికి లేఖ రాస్తానన్నారు. ఒక సిట్టింగ్‌ ఎమ్మెల్సీని ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగొద్దని రఘురామ కృష్ణంరాజు అన్నారు.