రోలుగుంట మండలం, జే.నాయుడు పాలెంలో దారుణం


ఆర్థిక సమస్యల కారణంగా భార్యా, భర్తల మధ్య విభేదాలు

అర్థరాత్రి ఇద్దరి పిల్లలతో పాటు బావిలో దూకిన తల్లి

చిన్నారులు మ్రుతి, క్షేమంగా బయట పడ్డ తల్లి

కేసు నమోదు చేసిన పోలీసులు.

రోలుగుంట ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :

ఆర్థిక సమస్యల కారణంగా భార్య, భర్తల మధ్య చేలరేగిన విభేదాలు ఆ కుటుంబాన్ని శోకంలో ముంచింది.. అన్నెం, పున్నెం తెలియని ముక్కుపచ్చలారని  చిన్నారుల మరణానికి ఈ ఘటన దారితీసింది... వివరాలిలా ఉన్నాయి. రోలుగుంట మండలం, జె.నాయుడుపాలెంనకు చెందిన గడదాసు నాగరాజుకు, అదే మండలం, వడ్డిప గ్రామానికి  చెందిన సాయితో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. నాగరాజు ఆటో డ్రైవర్ గా  ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి వారికి భాను (4) ప్రుద్వీ రాజ్ (2) జన్మించారు. ఆటో డ్రైవర్ కావడంతో అంతంమాత్రంగా వచ్చే ఆదాయంతో నిత్యం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో భార్యా, భర్తల మధ్య తరచూ వాగ్వివాదం జరుగుతుండేది. ఇటీవల బంగారం కొనే క్రమంలో వీరిరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ వల్ల తన పిల్లలను తీసుకుని భార్య సాయి హడావిడిగా బయటకు వెళ్లిపోయింది. తిరిగి తనే వస్తుందని భావించిన నాగరాజు పట్టించుకోలేదు. అయితే సాయి తన పిల్లలైన భాను, ప్రుద్వీలను తీసుకుని సమీపంలో ఉండే భావి వద్దకు వెళ్లింది. ముందు పిల్లలను బావిలో పడేసి, తరువాత తనూ దూకేసింది. ఈ ఘటనలో చిన్నారులు మ్రుతి చెందగా, దూకిన తరువాత భయపడ్డ తల్లి సాయి బావిలో మెట్టుపట్టుకుని వేలాడుతూ ఉండిపోయింది. ఉదయం అటుగా వస్తున్న మనుష్యుల శబ్ధం విని సాయి గట్టిగా కేకలు వేయడంతో వారంతా వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని అప్పటికే చనిపోయిన చిన్నారులతో పాటు తల్లిని బయటకు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.