దేశం దారితప్పుతోంది...చక్క దిద్దుకోవాలి

 



కేంద్రంలో మంచిప్రభుత్వం ఉంటేనే సాధ్యం
అందుకే జాతీయ రాజకీయలపై దృష్టి పెట్టా
శక్తి మేరకు కేంద్రంలోనూ మంచి ప్రభుత్వం కోసం కృషి
మల్లన్న సాగర్‌ సభలో స్పష్టం చేసిన సిఎం కెసిఆర్‌
సిద్దిపేట, ఫిబ్రవరి 23  (జనం సాక్షి):  దేశం దారితప్పుతోందని, దుర్మార్గమైన వ్యవస్థ కొనసాగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కర్ణాటకలో దిక్కుమాలిన మతకల్లోలం లేపారని అన్నారు. కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉండాలని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రభుత్వాలు వద్దని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని సిఎం కేసీఆర్‌ తేల్చిచెప్పారు. తప్పకుండా ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకుచ్చిన శర్వశక్తులు, సకల మేథోసంపత్తిని ఉపయోగించి, చివరి రర్తం బొట్టు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. దేశం కూడా దారి తప్పి పోతోంది. చాలా దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది. దేశంలో ఉన్నం కాబట్టి వంద శాతం మనం ముందుకు పోవాలి. అసహ్యం పుట్టే పనులు జరుగుతున్నాయి. మతకల్లోలాల పేరిట విధ్వంసం సృష్టిస్తున్నారు. పిల్లలకు కర్ణాటక వెళ్లి చదువుకోవాలంటే భయపడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని అంతం
చేయాలి. బెంగళూరు సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా మారింది. మన హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి లక్షా 50 వేల కోట్ల సాప్ట్‌వేర్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌లో దిగుతున్నాయి. ప్రతి రోజూ 580 వరకు విమానాలు ల్యాండ్‌ అవుతున్నాయి. తెలంగాణలో ఎక్కడా పోయినా ఎకర భూమి 20 లక్షలకు పైగానే ఉంది. మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉంది. అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్టాల్రు బాగు పడాలంటే కేంద్రంలో కూడా ధర్మంతో పని చేసే ప్రభుత్వం ఉండాలి. కులాలు, మతాల పేరు విూద చిచ్చు పెట్టొద్దు. ప్రశాంత వాతావరణంలోనే పరివ్రమలు వస్తాయి. మతకల్లోలాల ఉంటే పరిశ్రమలు రావు. మతకల్లోలాలు చాలా దుర్మరార్గం.. ఇవి దేశానికి ప్రమాదం, మంచిదికాదు. దాన్ని సంహించకూడదు. ఆ క్యాన్సర్‌ను విసర్తించకుండా చర్యలు చేపట్టాలి. ఈ దేశం నుంచి ఎక్కడికక్కడనే తరిమికొట్టాలి. ప్రజల కోసం పని చేయాలి. ప్రజలకు చేటు చేసే వారిని నిలదీసి ఎదుర్కోవాలి. క్షమించి ఊరుకోవద్దు. మనందరం పురోగమించాలి. అంఉదకే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని కెసిఆర్‌ అన్నారు. తప్పకుండా ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకుచ్చిన శర్వశక్తులు, సకల మేథోసంపత్తి ని ఉపయోగించి, చివరి రర్తం బొట్టు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతాను ముందుకు పోతాను అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.