చిన్న వ్యాపారులకు అండగా జగన్న తోడు

 

5,10,462 మందికి రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు
నేరుగా అకౌంట్లకు జమచేసిన సిఎం జగన్‌
చిరువ్యాపారులకు అండగా నిలవాలన్న లక్ష్యం
వెల్లడిరచిన సిఎం జగన్‌
అమరావతి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం కోసమే జగగనన్న తోడు పథకం ద్వారా రుణాలు అందిస్తున్నామని, ఇది వారికి ఓ మంచి అవకాశమని సిఎం జగన్‌ అన్నారు. ఈ పథకం కింద లక్షలాది మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని అన్నారు. ఈ పథకం ద్వారా వారి కళ్లవిూద వారు నిలబడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు ఈ జగనన్న తోడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జగనన్న తోడు పథకం లబ్దిదారులకు సీఎం జగన్‌ సోమవారం నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేశారు. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాల ఇచ్చి వారికి అండగా నిలిచారు.
రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని అన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వారి కాళ్లవిూద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగ పడుతుందని అన్నారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని అన్నారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే విూకు మళ్లీ రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని అన్నారు. మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ది చేకూరనుందని తెలిపారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10వేల రుణం
అందజేస్తోందని తెలిపారు. వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ రూ.16.16 కోట్లు కలిపి మొత్తం రూ.526.62 కోట్లు లబ్ది చేకూరుతుందని అన్నారు. అర్హులై ఉండి రుణం రాకపోతే.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్దిదారులకు సందేహాలుంటే 08912890525కు కాల్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం దొరుకుతుందని అన్నారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికైనా డబ్బులు రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కోవిడ్‌ కారణం చిరు వ్యాపారులు బాగా దెబ్బతిన్నారని సర్వేల్లో చూశానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. నిరుపేదల కుటుంబాలను కాపాడేందుకు సంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. అవినీతికి తావులేకుండా పేదలకు రూ. 1.29 లక్షల కోట్లు అందించామని తెలిపారు. మిగతా రాష్టాల్ల్రో కంటే పేదలను మన రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుందని అన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడత 5,35,112 మందికి, రెండో విడత 3,70,517 మందికి.. రెండు విడతల్లో మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 2020 నవంబర్‌ 25న ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ’జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి విూడియాతో మాట్లాడుతూ.. నవ రత్నాల లబ్దిదారులు కూడా రాక్షస మనస్తత్వంతో చంద్రబాబు వెంట వెళుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాపై చంద్రబాబు అనవసర రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. అంతేకాకుండా అఖండ, పుష్ప, బంగార్రాజు లాంటి సినిమాలు కూడా హిట్టయ్యాయని ఆయన తెలిపారు. సినిమా దెబ్బతింటే హీరోలు నిర్మాతలను ఆదుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. హీరోలు ఎవ్వరూ పేదలను ఆదుకుంది లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సీఎం జగన్‌ రియల్‌ హీరో అన్న ఆయన.. జగన్‌ హీరోగా పెట్టి సినిమా తీస్తే వెయ్యి రోజులు ఆడుతుందని అన్నారు.