కొత్త జిల్లాలపై తొలగని సందిగ్ధత


జిల్లాల పేర్లు,ప్రాంతాలపై అభ్యంతరాలు
మార్చి 3 వరకు అభ్యంతరాల స్వీకరణ
అమరావతి,ఫిబ్రవరి18 ( జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన నాటినుంచి రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. అయితే ప్రభుత్వ ప్రకటన వచ్చినప్పటి నుంచి కొన్ని చోట్ల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో తమకో జిల్లా కావాలంటూ.. పేర్లపై మార్పులు, డివిజన్‌ల చేర్పులు వంటి వాటిపై చాలా చోట్ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్‌ఆపటు తగదని టిడిపి
వాదిస్తోంది. ఎందుకంటే నిజయోకవర్గాల పునర్విభజన రానున్న నాలుగైదేళ్లలో జరునుంది. ఇది శాస్త్రీయంగా లేదని వాదిస్తున్నారు. నియోజకవర్గాల పేర్లపైనా అభ్యంతరాలు వస్తున్నాయి. మరోవైపు
ఉగగాది నాటికి జిల్లాలను అందుబాటులోకి తెచ్చేల కార్యాచరణ సిద్దం అవుతుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాలు అందుబాటులోకి వస్తాయని సిఎం జగన్‌ ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అనేక చోట్ల నుంచి అభ్యంతరాలు వినిపిస్తున్న క్రమంలో.. వచ్చే నెల మూడో తేదీ వరకు విజ్ఞప్తులు స్వీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత మార్చి 10 తేదీ వరకు వాటిని పరిశీలించనుంది. 11 నుంచి 14 వరకు సీఎస్‌ కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం మార్చి 17న రెవెన్యూశాఖ తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. మార్చి 23 నుంచి 25 వరకూ గెజిట్‌ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో పాలన రాబోతుంది. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాల గుర్తింపు పనిలో అధికారులు పడ్డారు.
ఇప్పటి వరకు వచ్చిన ప్రధాన డిమాండ్లు..పరిశీలిస్తే రాజంపేట కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై ఆందోళన కొనసాగుతోంది. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ దీక్ష చేపట్టారు. హిందైపురానికి సత్యసాయి పేరు పెట్టడంపై కొన్ని చోట్ల విమర్శలు వ్యక్తమవు తున్నాయి. బాలాజీ జిల్లా పేరు మార్చి తిరుపతిగానే కొనసాగించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం అఖిలపక్షం డిమాండ్‌ చేస్తోంది. పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని అకిలపక్షం డిమాండ్‌ చేస్తతోంది. కందుకూరులోనూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. కోనసీమ జిల్లాను అంబేద్కర్‌ జిల్లాగా పెట్టాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ద్వారకా తిరుమలను ఏలూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది. భీమవరం బదులు నర్సాపురంను పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళన కొనసాగు తోంది. నూజివీడు, గన్నవరం, పెనమలూరును ఎన్టీఆర్‌ జిల్లాలో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. కైకలూరును పాత కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవనిగడ్డ రెవెన్యూ డివిజన్‌ కోసం టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.