దాణా కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల జైలు


ఐదేళ్ల జైలుతో పాటు 60 లక్షల జరిమానా విధింపు

శిక్ష ఖరారు చేసిన రాంచీ సీబీఐ కోర్టు 

రాంచీ,ఫిబ్రవరి21జ‌నంసాక్షి : దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు రాంచీ సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 60 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఫిబ్రవరి 15న కోర్టు దాణా కుంభకోణం ఐదో కేసులో లాలూను దోషిగా తేల్చింది. ఆయన బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దొరాండా ట్రెజరీ నుంచి రూ.139.5కోట్లు అక్రమంగా విత్‌ డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం శిక్ష ఖరారు చేసింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఇతర కేసుల్లో దోషిగా తేలిన లాలూకు ఇప్పటికే 14 ఏళ్ల జైలు శిక్ష పడిరది. మూడున్నర ఏళ్ల పాటు జైలులో గడిపిన ఆర్జేడీ చీఫ్‌.. అనారోగ్యం కారణాలతో ఇటీవలే బెయిల్‌?పై బయటకు వచ్చారు. రాంచీ హాస్పిటల్‌?లో ట్రీట్మెంట్‌ తీసుకుంటున్న ఆయన.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. 1996లో నమోదైన దాణా కుంభకోణం కేసులో 170 మంది నిందితులుగా ఉండగా.. వారిలో 55 మంది ఇప్పటికే మరణించారు. దాణా కుంభకోణంలోనే భగల్‌పూర్‌ ట్రెజరీ నుంచి అక్రమంగా డబ్బు విత్‌ డ్రా చేసిన కేసు విచారణ పాట్నా సీబీఐ కోర్టులో పెండిరగ్‌?లో ఉంది. దాణా కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్‌ లూలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఐదేళ్ల శిక్ష ఖరారు కావడంపై ఆయన కుమారుడు, బీహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ స్పందించారు. కోర్టు తీర్పుపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. బీజేపీపై పోరాటం చేస్తున్నందుకే తన తండ్రిని జైలు పాలు చేశారని తేజస్వీ ఆరోపించారు. బీజేపీతో చేతులు కలిపి ఉంటే లూలూజీ సత్యహరిశ్చంద్రుడయ్యేవారని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతాలను వ్యతిరేకించినందునే ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి తామెప్పుడూ భయపడమని అన్నారు.