ఏపిలో టెన్త్‌,ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల


మార్చి11 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

ఎప్రిల్‌ 8 నుంచి ఇంటర్‌ బోర్డు పరీక్షలు
మే 2నుంచి టెన్త్‌ పరీక్షలు
అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలను మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరిక్షలు, ఏప్రిల్‌ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరిక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని తెలిపారు. పదో తరగతి పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి
పరిక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని తెలిపారు.పరీక్షల సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు టెన్త్‌ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి సురేష్‌ తెలిపారు