ఉక్రెయిన్‌ విషయంలో ప్రధానికి మమత మద్దతు

దేశ సార్వభౌమాదఙకారమే ముఖ్యమని లేఖ
కోల్‌కతా,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్‌ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆమె ఓ లేఖలో తెలిపారు. దేశ గౌరవాన్ని ఎవరూ సవాల్‌ చేయలేరని, ఆ గౌరవాన్ని కాపాడేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు ఆమె చెప్పారు. సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్న ఓ సీనియర్‌ ముఖ్యమంత్రిగా.. ఓ జాతీయ పార్టీ నేతగా.. ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో.. మన దేశ
నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మమత ఆ లేఖలో తెలిపారు. అంతర్జాతీయంగా తీవ్రమైన సంక్షోభం ఏర్పడిరదని, ఈ సమయంలో స్వదేశీయంగా ఉన్న విబేధాలను పక్కనపెట్టాలని, ఓ దేశంగా ఐక్యత చాటాలని ఆమె అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన విదేశీ వ్యవహార సూత్రాలు ఏ రకంగా దెబ్బతినవద్దని ఆమె అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుననట్లు ఆమె చెప్పారు. స్వాతంత్యంª`ర పొందిన నాటి నుంచి అంతర్జాతీయ శాంతికి భారత్‌ కట్టుబడి ఉందని, దురాక్రమణ, సరిహద్దు ఉల్లంఘనలను ప్రోత్సహించేదిలేదన్నారు. సంక్షోభ సమయంలో దౌత్య వ్యవహారాలను సరైన రీతిలో అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు దీదీ తన లేఖలో తెలిపారు.