పేద కుటుంబానికి సిమెంట్ బస్తాలు అందజేసిన గణేష్ నాయక్


ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 11 (జనంసాక్షి) యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన సభావత్ జగన్  ఇళ్లు కట్టుకొలేని స్థితిలో ఉన్న పేద కుటుంబానికీ అండగా నిలిచిన టిఆర్ఎస్వి మండల ప్రధాన కార్యదర్శి వర్త్యవత్. గణేష్ నాయక్. తనవంతు సహకారం తో 15 సిమెంట్ బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ నాయక్ కుటుంబానికీ గ్రామ ప్రజలతో పాటు పేద కుటుంబ సభ్యులు అభినందిస్తు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా యూత్ సభ్యులు పాల్గొన్నారు..