మేడారంలో డిజిటల్ హుండీల ఏర్పాటు.....


ములుగు(మేడారం)ఫిబ్రవరి11(జనం సాక్షి):-

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో హుండీలతో పాటు మేడారంలో డిజిటల్ హుండీలకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది.2020 మహా జాతరలో దేవాదాయ శాఖ 494 హుండీలను ఏర్పాటు చేయగా రూ. 11.64 కోట్ల ఆదాయం సమకూరింది.ఈ సారి మహాజాతరలో క్యూ ఆర్ కోర్ ద్వారా డబ్బులు చెల్లించే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నారు.ఈ మేరకు మేడారం జాతర పరిసరాల్లో అధికారులు 20 డిజిటల్ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. కెనరా బ్యాంకు సౌజన్యంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.సెల్ ఫోన్ ద్వారా ఫోన్ పే,గూగుల్ పే, పేటీఎం నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి భీమ్ యూపిఐ ద్వారా అమ్మవార్లకు కానుకలు చెల్లించుకోవచ్చు.కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో సరికొత్త ఆలోచనలకు దేవాదాయ శాఖ కొత్త ఐడియా తీసుకొచ్చింది.