భారత్‌ను సరైన దిశలో నడిపే యత్నాలు

దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాల్సి ఉంది

దేశహితం కోసమే తమ ప్రణాళిక 

జార్కండ్‌ సిఎం హేమంత్‌ సోరేన్‌తో భేటీ

శిబూసోరేన్‌ ఆశీర్వాదం తీసుకున్నకెసిఆర్‌

బిర్సా ముండా విగ్రహానికి నివాళి

అర్పణగల్వాన్‌ బాధిత రెండు కుటుంబాలకు చెక్కులు అందచేత

విూడియాతో వివరాలు వెల్లడిరచాన సిఎం కెసిఆర్‌

రాంచీ,మార్చి4(జనంసాక్షి ): బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటులో భాగంగా  ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారు. ఇందులోభాగంగా జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్‌ విూడియాతో మాట్లాడారు. జార్ఖండ్‌ సీఎంతో జాతీయ రాజకీయాలపై చర్చించామని తెలిపారు. త్వరలోనే మరికొందరు నేతలను కలుస్తామని ప్రకటించారు. దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాలన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదు.. అనుకూలం కాదని తేల్చిచెప్పారు. దేశహితం కోసమే తమ ప్రణాళిక అని తెలిపారు. తమది ఏ ఫ్రంటో తర్వాత చెబుతామని కేసీఆర్‌ వెల్లడిరచారు. దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి.. భారత్‌ను సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.  తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్‌ ఎన్నోసార్లు మద్దతు పలికారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారు. ఇవాళ శిబూ సోరెన్‌ ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు అని కేసీఆర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదు.. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో పలువురి నేతల్ని కలవడం జరుగుతోంది. కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేసీఆర్‌ తెలిపారు. యాంటీ బీజేపీ ఫ్రంట్‌ సాగిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. భారత్‌ను సరైన మార్గంలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరగాలని.. ఆ దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. ఎటువంటి ఫ్రంట్‌ లేదని, ఏర్పడబోయే ఫ్రంట్‌ మున్ముందు తెలుస్తుందన్నారు. 75 ఏండ్లలో ఆశించిన రీతిలో దేశం వృద్ధి చెందలేదన్నారు.. అచ్ఛే భారత్‌ విషయంలో విూ తోడ్పాటు కూడా అవసరమన్నారు.. అచ్ఛే భారత్‌, ప్రస్తుతం ఉన్న భారత్‌ కన్నా మెరుగైన దేశాన్ని సృష్టించాలన్నారు. అన్ని రంగాల్లో .. వివిధ నేతలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మున్ముందు మరిన్ని విషయాలు వెల్లడిరచనున్నట్లు తెలిపారు. కాస్త ఓపిగ్గా ఉంటే.. మున్ముందు విపులంగా విషయాలను వెల్లడిస్తానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.గల్వాన్‌ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటు న్నామని కేసీఆర్‌ తెలిపారు. జార్ఖండ్‌లో రెండు కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాం. గల్వాన్‌ కాల్పుల్లో మరణించిన కల్నల్‌ సంతోష్‌ మా తెలంగాణ బిడ్డే. ఆ కుటుంబంతో మిగతా అమరుల కుటుంబాలకు కూడా సాయం చేస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు.  జార్ఖండ్‌ రాజధాని రాంచీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు రాంచీ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. జార్ఖండ్‌ గిరిజన ఉద్యమకారుడు బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. బిర్సా ముండా గిరిజన జాతికి, ఈ దేశానికి అందించిన సేవలను సీఎం కొనియాడారు. కేసీఆర్‌ వెంట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌ కుమార్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.  బిర్సాముండా ఆటవిక జాతుల స్వాతంత్య సమరయోధుడు, జానపద నాయకుడు కూడా.ఇతను ముండా జాతికి చెందినవాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్‌, రaార్ఖండ్‌ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటీష్‌ కాలంలో జరిగిన మిలీనేరియన్‌ ఉద్యమానికి సారథ్యం వహించాడు. తద్వారా భారత స్వాతంత్యోద్య్రమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా. బ్రిటిష్‌ వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు.