రాధేశ్యామ్ తమిళ వర్షన్ ప్రీరిలీజ్ విడుదల
సినిమా చూస్తే క్లైమాక్స్ తెలుస్తుందన్న ప్రభాస్పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ’రాధేశ్యామ్’ ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నాడు. లేటెస్ట్గా ఈ
చిత్ర తమిళ ప్రీ రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది. పీరియాడికల్ లవ్స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ’జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ట్రైలర్లు సినిమా పైన భారీ అంచనాలను నమోదు చేశాయి. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ విూడియాలో వైరల్గా మారింది.
’రాధేశ్యామ్’ చిత్రానికి 300కోట్ల బ్జడెట్ అయ్యిందట. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులకు భారీగా డీల్ కుదిరిందని సమాచారం. రాధేశ్యామ్ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ సంస్థ అన్ని భాషలకు కలిపి దాదాపు 150కోట్ల భారీ ధరకు విక్రయించిందని సమాచారం. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ జరగనుందట. ఇకపోతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ’రాధేశ్యామ్’ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ముఖ్యంగా ప్రభాస్, పూజా కలిసి ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. సినిమా తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుండడంతో అన్ని చోట్లా ప్రమోషన్ కార్యక్రాలకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా శుక్రవారం ’రాధేశ్యామ్’ ప్రమోషన్ల కోసం చిత్రబృందం చెన్నైకి వెళ్లింది చెన్నైలో పుట్టి పెరిగిన ప్రభాస్ తన అనర్గళమైన తమిళంతో విలేకరులను కూడా ఆకట్టుకున్నాడు. ప్రెస్ విూట్లో అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అయితే ఒక రిపోర్టర్ అడిగిన ఒక ప్రశ్నకు ప్రభాస్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. విలేఖరి రాధే శ్యామ్ క్లైమాక్స్ గురించి ప్రశ్నించాడు. లవ్ గెలుస్తుందా లేక డెస్టినీ గెలుస్తుందా అని అడిగాడు. దీంతో ప్రభాస్ స్పందిస్తూ అది నేను ఎలా చెప్తా సార్. కనీసం 50 రూపాయల టిక్కెట్ అన్నా కొని సినిమా చూడండని అంటూ పంచ్ వేశారు ఫన్నీగా. ఇక అందరూ నవ్వుతుండగానే సినిమా నిర్మాణ బ్జడెట్ రూ. 300 కోట్లు అని, ఇప్పుడు నేను క్లైమాక్స్ విూకు చెప్తే నన్ను చంపేస్తారు సార్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది.