మళ్లీ ఆందోళన కలిగిస్తోన్న కరోనా కేసులు

పెరుగుతున్న కేసులతో ప్రపంచంలో మరోమారు టెన్షన్‌

అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి) :  ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆసియాలోని 

వివిధ ప్రాంతాల్లో మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. కొన్ని వారాల పాటు మహమ్మారి తగ్గినట్లు కనిపించినప్పటికీ.. కోవిడ్‌ ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గాబ్రియేసస్‌ హెచ్చరించారు. ప్రతి దేశం వేర్వేరు సవాళ్లతో విభిన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నందున.. మహమ్మారి ముగియలేదని గ్రహించాలని పేర్కొన్నారు. ’ కొన్ని దేశాల్లో పరీక్షలు తగ్గినప్పటికీ.. కేసులు పెరుగుతున్నాయి. అంటే మనం చూస్తున్న కేసులు మంచుకొండ కొన మాత్రమే’ అని తెలిపారు.జర్మనీ, ఫ్రాన్స్‌, యుకె, దక్షిణకొరియాలో పెరుగుతున్న కేసులు దక్షిణ కొరియాలో గురువారం ఒక్క రోజులో 6.2 లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికా కన్నా రికార్డు స్థాయిలో తాజా కేసులు వెలుగు చూశాయి. అక్కడ కేవలం వారం రోజుల్లో 24 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇక జర్మనీలో వారం రోజులో 15 లక్షలు, వియత్నాం 12 లక్షలు, ఫ్రాన్స్‌ 5.2 లక్షలు, యుకెలో 4.8 లక్షల కేసులు నమోద య్యాయి. చైనా కూడా మునుపెన్నటి లేని విధంగా కోవిడ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. డబ్ల్యుహెచ్‌ఒ ప్రకారం... వారం రోజుల్లో కొత్తగా నమోదైన కేసులో దక్షిణ కొరియా ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంది. ఇన్ని కేసులు నమోదవుతున్నా.. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన ఆంక్షలను సడలించాలని దేశం నిర్ణయించింది. కరోనా నుండి కోలుకున్న తర్వాత.. చేపట్టే క్వారంటైన్‌ వ్యవధిని చైనా తగ్గించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య వనరులను ఆదా చేసేందుకు ఈ చర్యకు ఉపక్రమించింది. గురువారం.. చైనాలో ఇక్కడ 2,400 కేసులు నమోదయ్యాయి.ఇటలీలో మరోసారి కేసులు పెరుగుతున్నప్పటికీ.. కరోనా ఆంక్షలను దశలవారీగా సడలించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఇటలీ ప్రభుత్వం ప్రకటించింది. మే 1 నుండి రెస్టారెంట్లు, జిమ్‌, ప్రజా రవాణా వంటి పలు సేవల్లో కోవిడ్‌ తీసుకున్న ధ్రువీకరణ పత్రాలు లేదా కరోనా వైరస్‌ నుండి కోలుకున్నట్లు నిరూపించాల్సిన అవసరం లేదని మంత్రి వర్గం తెలిపింది.