మీర్జా బిల్ట్స్ ఖదీర్ బహదూర్ (1845-1892)


పరాయిపాలకుల పెత్తనం నుండి స్వదేశాన్ని విముక్తం చేసేందుకు సాగిన పోరాటంలో భాగంగా చిన్న వయస్సులో స్వతంత్ర అవధ్ పాలనను చేపట్టిన మీర్జా బిర్జీస్ ఖదీర్ బహదూర్ 1845లో జన్మించారు. బేగం హజరత్ మహల్, అవధ్ నవాబు వాజిద్ అలీ షాహ్ తల్లితండ్రులు. ఆయన అసలు పేరు ముహమ్మద్ రంజాన్ అలీ బహదూర్. తండ్రి వాజిద్ అలీ షాహ్ ను ఆంగ్లేయులు అరెస్టు చేసి అక్రమంగా ఆక్రమించుకున్న అవధ్ రాజ్యాన్ని తల్లి హజరత్ మహల్ మార్గదర్శకత్వంలో పునరాక్రమించుకుని 1857 జూలై 7న ఆయన అవధ్ పాలకుడయ్యా రు. తల్లి హజరత్ మహల్ సమర్థవం తమైన మార్గదర్శకత్వం, స్వదేశీ యో ధుల శౌర్యప్రతాపాల ఫలితంగా లక్నో నుండి ఆంగ్లేయులు పలాయనం చిత్త గించగా 10 మాసాల పాటు అవిచ్చి న్నంగా పాలన సాగించారు. 1858 నవంబర్ 1న విక్టోరియా మహారాణి విడుదల చేసిన ప్రకటనకు ధీటుగా స్వదేశీయులలో ధైర్యాన్ని నూరిపోస్తూ, విదేశీయుల కుయుక్తులను, కుట్రలను బహిర్గతం చేస్తూ బిర్జీస్ ఖదీర్ పేరిట 1858 డిసెంబర్ 31న చారిత్రాత్మక  ప్రకటన విడుదలయ్యింది. బిర్జీస్ ఖదీర్ నుండి ఎదురైన పరాభవాన్ని భరించ లేని ఆంగ్ల సైన్యాధిపతులు కోలిన్ క్యాంప్ బెల్, హ్యావ్ లాక్, ఓట్రాంలు భారీ సైనిక బలగాలతో లక్నోను చుట్టుముట్టారు. ఆంగ్లేయులకు సిక్కులు, గూరా సైనిక బలగాలు అండగా నిలిచాయి. లక్నో ప్రజలు, స్వతంత్ర అవధ్ సైనికులు, ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడినా ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక బలగాలను ఓడించడం అసాధ్యమయింది. ఆ యుద్ధరంగంలో స్వయంగా పాల్గొన్న రాజమాత బేగం హజరత్ మహల్ చివరకు సహచరుల ఒత్తిడి మేరకు మిర్జా ఖదీర్తో నేపాల్ పర్వత ప్రాంతాల్లోకి నిష్క్రమించారు. ఆంగ్లేయుల మీద తిరిగి పోరాటానికి సన్నాహాలు చేస్తుండగా ఆయన తల్లి బేగం హజరత్ మహాల్ 1879లో మరణించారు. కలకత్తాలో ఆంగ్లేయుల నిర్బంధంలో ఉన్న తండ్రి నవాబు వాజిద్ అలీ షాప్ కూడా కన్నుమూశారు. తండ్రి వాజిద్ అలీషా మరణంతో అవధ్ వారసుడిగా మిగిలిన బిటీస్ ఖదీరను అవధ్ వారసత్వం నుండి తప్పించాలని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు అనుకున్నారు. అందుకు గాను కుటిల యత్నాలను ప్రారంభించి చర్చల పేరుతో బిర్జీస్ ఖదీరను కలకసయ్యద్ త్తాకు రప్పించారు. ఆంగ్లేయుల కుట్రను గ్రహించలేకపోయిన బిర్జిస్ ఖదిర్ కుటుంబ సభ్యులతో కలకత్తా వచ్చారు. ఆ రాజకుటుంబం గౌరవార్ధం ఆంగ్లేయులు విందు ఏర్పాటు చేశారు. 1893 ఆగస్టు 13న కుమారుడు ఖుర్షీద్ ఖదీర్, కుమార్తె జమాల్ ఆరా బేగంతో సహా ఆంగ్లా ధికారులు ఇచ్చిన విందులో ఆయన పాల్గొన్నారు. ఆ విందులో ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన విషాహారాన్ని ఆరగించటంతో బిటీస్ ఖదీర్ తన ఇరువురు బిడ్డలతో సహా ప్రాణాలు విడిచారు. భార్య మొహబత్ ఆరా బేగం, చిన్న కుమార్తె హుస్నా అదా బేగం ఆ విందుకు రాకపోవటంతో ఆ ప్రాణాంతక పన్నాగం నుండి బతికి బయపడ్డారు. ఈ విధంగా చివరి వరకు స్వతంత్ర అవధ్ కోసం తపించి, పోరాటం సాగించిన మీర్జా బిర్జీస్ ఖదీర్ బహదూర్ 1892 ఆగస్టు 14న ఆంగ్లేయుల కుట్రకు బలయ్యారు.



సయ్యద్ నశీర్ అహమ్మద్


(9440241727)