హాస్టల్లో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య


హైదరాబాద్‌,డిసెంబర్‌14(జ‌నంసాక్షి):  నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ హస్టల్‌లో ఉంటున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సాయితేజ(23) అనే యువకుడు వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉద్యోగం రావట్లేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.