తెలంగాణలో కొత్తగా 1718 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 3(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,718 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 285 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,97,327 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ 8 మంది మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1,153కు చేరింది.గడిచిన 24 గంటల్లో 2,002 మంది చికిత్సకు కోలుకొని ఇండ్లకు వెళ్లగా మొత్తం 1,67,846 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 28,328 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా.. ¬ం ఐసోలేషన్‌లో 23,224 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 85.05గా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,084 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా మొత్తం 31,53,626 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.