మహబూబ్నగర్,నవంబర్11(జనంసాక్షి): జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన యూట్యూబ్-ఆన్లైన్ తరగతులను ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరావు, డీఈవో ఉషా రాణి, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు