హైదరాబాద్,సెప్టెంబర్28(జనంసాక్షి): రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాన్ని 30 శాతం మేర పెరిగాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.13వేలకు చేరింది. ప్రస్తుతం వారి వేతనం రూ.10వేలుగా ఉన్నది. ఎంపీటీసీలు, సర్పంచుల వేతనం రూ.6500కు పెరిగింది. ప్రభుత్వం నిర్ణయంతో ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు