పోలీసుల వారంతపు సెలవును తొలగించలేదు

ఎస్పీలు దీనిని పరిశీలించి చర్య తీసుకోవాలి

కరోనా సమయంలో వారు స్వచ్ఛందంగా డ్యూటీ చేశారు

తాహసిల్దార్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి సుచరిత

గుంటూరు,నవంబర్‌30(జనం సాక్షి) : పోలీసులకు వీక్లీ ఆఫ్‌ తొలగించలేదని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. కరోనా సమయంలో సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విధులు నిర్వహించారని తెలిపారు. ఆయా జిల్లాల ఎస్పీలు సిబ్బందికిచ్చే వీక్లి ఆఫ్‌లు అమలు చేస్తారన్నారు.  మంగళవారం గుంటూరు తూర్పు తహశీల్దార్‌ కార్యాలయాన్ని హోంమంత్రి ప్రారంభించారు. 2009 లోనే తహాశీల్దారు కార్యాలయానికి మంజూరు జరిగిందని అన్నారు. ఇప్పుడు ప్రత్యేక భవనంలోకి మార్చామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెండిరగ్‌లో ఫైల్స్‌ ఉంచకుండా ప్రజలకి సేవలందించాలని హోంమంత్రి సుచరిత తెలిపారు. మంగళవారం గుంటూరు తూర్పు తహశీల్దార్‌ కార్యాలయాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా చర్చల్లో నలుగుతున్న వారానికి ఒకరోజు సెలవు అంశాన్ని ఆచరణలో పెట్టడంతో పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. బ్రిటిష్‌ పాలనలో రూపొందించిన 1859 నాటి మద్రాస్‌ పోలీస్‌ యాక్ట్‌ను ఆ తర్వాత సవరించారు. 1861లో ఆ చట్టం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత దేశంలో, తెలుగు రాష్టాల్రలో పలు మార్పులు జరిగినప్పటికీ కీలక చట్టాలు నాటి నుంచి అలానే కొనసాగుతున్నాయి. ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత ఉమ్మడి ఆంధప్రదేశ్‌, అనంతరం 2014లో ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్రు ఏర్పడినా, చట్టాల్లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. దాని ఫలితంగానే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సిబ్బంది మాదిరిగా తమకు కూడా వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని పోలీసు అధికారులు, సిబ్బంది డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఎన్నికల హావిూలో భాగంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. సుదీర్ఘ కాలంగా చర్చలకే పరిమితమవుతూ వస్తున్న ఈ అంశాన్ని అమలు జరుగుతుండడంతో పోలీసులకు కూడా వారానికి ఒకరోజు సెలవు దక్కింది.