యాసంగిలో వడ్లు కొనం

 



` చేతులెత్తేసిన కేంద్రం
` దిక్కుతోచని రైతాంగం
` తెలంగాణ మంత్రులకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌
న్యూఢల్లీి,నవంబరు 26(జనంసాక్షి):తెలంగాణలో యాసంగిలో పండిరచే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలంగాణ మంత్రులకు స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ మంత్రుల బృందం నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది.కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను తెలంగాణ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మల్లారెడ్డితో పాటు ఎంపీలు నామా నాగేశ్వర రావు, బీబీ పాటిల్‌, సురేశ్‌ రెడ్డి కలిశారు. యాసంగిలో వరి ధాన్యం సేకరణపై మంత్రితో చర్చించారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుపై సానుకూల నిర్ణయం రాలేదు.ఈ నెల 23న మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌తో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. నాటి భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పూర్తి స్పష్టత ఇవ్వని కేంద్ర మంత్రులు ఈ నెల 26న మరోసారి సమావేశమవుదామని ప్రతిపాదించారు.